కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్గా ఎన్.ప్రశాంత్
VKB: కొడంగల్ మున్సిపాలిటీకి జరిగిన రెండో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నందారం ప్రశాంత్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న ప్రశాంత్ కుటుంబం నుంచి గతంలో నందారం వెంకటయ్య 3 సార్లు, అలాగే ఆయన బాబాయ్ N. సూర్యనారాయణ ఒకసారి కొడంగల్ ఎమ్మెల్యేలుగా సేవలు అందించారు.