పాలీసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

కృష్ణా: సాంకేతిక విద్యా శిక్షణ మండలి విడుదల చేసిన పాలిసెట్-2025 ఫలితాల్లో కృష్ణాజిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 4,083 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,425 మంది బాలురు, 1,658మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలుర ఉత్తీర్ణత శాతం 93.57% గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 97.29%గా నమోదైంది. జిల్లా మొత్తం ఉత్తీర్ణత శాతం 95.08%గా ఉంది.