డిప్యూటీ ఎంపీడీవోకు అవార్డు
ASR: 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొయ్యూరు మండలంలో పన్నులు, పన్నేతర వసూళ్లలో 100% లక్ష్యాన్ని సాధించినందుకు ఇంఛార్జ్ డిప్యూటీ ఎంపీడీవో ఎం. బాబూరావుకు ఉత్తమ అవార్డు లభించింది. గురువారం పాడేరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, డివిజనల్ అధికారి పీఎస్ కుమార్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కృషిని అధికారులు అభినందించారు.