రాజమండ్రిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం
E.G: రాజమండ్రిలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కార్యవర్గ సభ్యులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.