మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీకి వినతి

మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీకి వినతి

W.G: ఆకివీడు శివారు తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, మున్సిపాలిటీ నుంచి ఎటువంటి పౌర సేవలు అందడం లేదని నేతలు పెంకి అప్పారావు, బీవీ వర్మ జేసీ దృష్టికి తీసుకెళ్లారు.