దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు

దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. కార్తీక మాసం శనివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 595 జంటలతో వేద పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించారు. నవంబర్ 3 నుండి 5వ వరకు దేవాలయంలో కార్తీకమాస ఉత్సవాలు చేయనున్నారు.