రైతులు ఆనందంగా లేరు: సీపీఎం

రైతులు ఆనందంగా లేరు: సీపీఎం

NLR: ఇఫ్కో కిసాన్ సెజ్ కి భూములు ఇచ్చిన రైతులు ఆనందంగా లేరని సీపీఎం నాయకులు గోని దయాకర్ తెలిపారు. కొడవలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉన్నారని ప్రజాప్రతినిధులు మాట్లాడడం దారుణం అన్నారు. ఎరువులు కర్మాగారం ఏర్పాటు చేస్తామని రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుని సహాయం చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.