గన్నవరంలో నేడు జాబ్ మేళా
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం గన్నవరం ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ పూర్తిచేసిన 18–35 ఏళ్ల యువత అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన వారికి వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.inలో నమోదు కావాలని సూచించారు.