T20 WC FINAL: అహ్మదాబాద్ చేరుకున్న ధోనీ
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ను టీమిండియా ఢీకొట్టనుంది. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అహ్మదాబాద్ చేరుకున్నాడు. కాగా.. ఇటీవల ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్, భారత్కు మధ్య జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్ను భార్య సాక్షితో కలిసి ధోనీ వీక్షించిన విషయం తెలిసిందే.