తహసీల్దార్కు మెమరాండం ఇచ్చిన వీఆర్ఏలు
NTR: కంచికచర్ల మండల వీఆర్ఏలు గురువారం తహసీల్దార్ నరసింహారావుకు మెమొరాండం అందజేశారు. ఏళ్ల తరబడి గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నప్పటికీ చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమకు పే స్కేల్ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న వీఆర్ఏలను వీఆర్వోలుగా, రికార్డు అసిస్టెంట్లుగా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రమోట్ చేయాలని కోరారు.