RBKను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
PPM: జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఇవాళ పాచిపెంట మండలం పి.కొనవలస గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా RBKలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి వ్యవసాయ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం పంచాయతీ చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు.