VIDEO: మల్దకల్ జాతరకు బస్సులు లేక ప్రజల అవస్థలు
గద్వాల: ఆదిశిలా క్షేత్రమైన మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప) స్వామి జాతరకు వచ్చే భక్తులు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతరకు భారీగా రద్దీ ఉన్నప్పటికీ, ఆర్టీసీ అధికారులు ప్రధాన డిపోల నుంచి సరిపడా ప్రత్యేక బస్సులు నడపకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు.