'ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'
NRML: మామడ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసులు బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం అలాగే స్థానిక బస్టాండ్లో ఆటో డ్రైవర్లు, వాహనదారులకు రహదారి భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు.