మాజీ కేంద్రమంత్రి మృతిపట్ల మంత్రి సీతక్క ప్రగాఢ సంతాపం
MLG: కేంద్ర మాజీమంత్రి, లోక్సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ మృతి పట్ల మంత్రి డా.దనసరి అనసూయ (సీతక్క) ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ కేబినెట్లో శివరాజ్ పాటిల్ కీలక బాధ్యతలను నిర్వర్తించారని సీతక్క గుర్తుచేశారు. దేశ పార్లమెంటరీ చరిత్రలో లోక్సభ స్పీకర్గా ఆయన పోషించిన పాత్ర అత్యంత ప్రశంసనీయం పేర్కొన్నారు.