'ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ను అధిగమించవచ్చు'
PPM: ప్రతీ ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని, ముందస్తు స్క్రీనింగ్తో క్యాన్సర్ను జయించవచ్చని DMHO డా.ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా పార్వతీపురం DMHO ఆఫీస్ వద్ద శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈమేరకు ఆరోగ్యకర జీవనశైలి, క్యాన్సర్ రహిత నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.