రేవంత్రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
TG: సీఎం రేవంత్రెడ్డిపై BRS నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జూబ్లీహిల్స్ ఆర్వోను కలిసి ఆయనపై ఫిర్యాదు చేశారు. మాజీసీఎం కేసీఆర్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్.. కేసీఆర్, కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు.