సీఎం నివాసానికి బాంబు బెదిరింపులు
చెన్నైలో(TN) బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. సీఎం స్టాలిన్తో పాటు ప్రముఖ నటులు అజిత్, అరవింద్ స్వామి, ఖుష్బూల నివాసాలకు డీజీపీ కార్యాలయం ద్వారా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్, డాగ్ స్క్వాడ్తో వారి నివాసాల వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు.