మేనూరులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
కామారెడ్డి జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటలలో జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలంలోని మేనూర్లో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బిక్కనూర్ మండల కేంద్రంలో 44.1, బిచ్కుంద, పాల్వంచ మండలంలోని వేల్పుగొండలో 43.9, ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా రాజంపేట 41 డిగ్రిలు నమోదైంది