44వ జాతీయ రహదారిపై కారు ప్రమాదం
GDWL: మానవపాడు మండలం, 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు (AP40DC1630) బోల్తా పడటంతో, కళావతి (60) అనే రిటైర్డ్ హెడ్ నర్సు మరణించారు. ఈ ప్రమాదంలో సైమన్ రాజు (63), డా. మనోజకుమార్ (37), డా. బేబీస్టెఫీ (34), ఫియాపాప (3) స్వల్పంగా గాయాలయ్యాయి.