మూడో టీ20 విజయంపై సూర్యకుమార్ హర్షం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో విజయం సాధించడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులో చేసిన మార్పులు సత్పలితాలను ఇచ్చాయని అన్నాడు. ముఖ్యంగా కొత్తగా జట్టులోకి వచ్చిన అర్ష్దీప్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ అద్భుత ప్రదర్శన చేయడం వల్లే తమకు విజయం లభించిందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలవడం కూడా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు.