VIDEO: వైభవంగా పిల్లలమర్రిలో 'లక్ష రుద్రాభిషేకం'
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పిల్లమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయం ఉంది. కార్తీక మాసం కావడంతో ఇవాళ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా రెండవ సోమవారం సందర్భంగా "లక్ష రుద్రాక్షలతో" రెండు శివాలయాల్లో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాలకి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు.