VIDEO: కలెక్టరేట్లో ప్రారంభమైన PGRS
గుంటూరు కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో ఖాజావలి బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన అర్జీలను ఆయా శాఖలకు పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవిన్యూ క్లినిక్లో ఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొని, అర్జీలను స్వీకరించారు.