న్యాయం చేయాలని తహసిల్దార్కు వినతి పత్రం అందజేత

MBNR: బాలానగర్ మండలం చిన్న రేవల్లిలో ఆర్ఆర్ఆర్ (RRR) రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతులు తమ భూములను తీసుకోకూడదని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. తమకు జీవనాధారం వ్యవసాయమేనని, ఉన్న పొలాన్ని కోల్పోతే బతుకుతెరువు ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కోల్పోకుండా చూడాలని తహసీల్దార్ను కోరారు.