గౌనివారిపల్లిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

గౌనివారిపల్లిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

SS: గోరంట్ల(మం) గౌనివారిపల్లి పంచాయతీ కేంద్రంలో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విద్యాధరణి, తదితరులు పాల్గొన్నారు.