నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS కార్యక్రమం
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కరివేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ నందన్ పాల్గొని అర్జీ దారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 49 వినతులు స్వీకరించినట్లు అధికారులు తెలియజేశారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.