బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే
E.G: విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అధ్యక్షతన జరిగిన 'స్పెషల్ ఇంటెన్స్ రివిజన్' సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. యూపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో రామకృష్ణారెడ్డి రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరించారు. బూత్ స్థాయి కార్యాచరణ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాత్మక చర్యలపై చర్చించారు.