బస్సు డ్రైవర్, కండక్టర్పై కత్తులతో దాడి
AP: నెల్లూరు జిల్లా బోసుబొమ్మ సెంటర్లో ఆకతాయిల హల్చల్ చేశారు. హారన్ కొట్టినా బస్సు సైడ్ ఇవ్వలేదని ముగ్గురు యువకులు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై కత్తులతో దాడి చేశారు. దీంతో డ్రైవర్, కండక్టర్కు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.