'రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదు'
AP: మాజీ సీఎం జగన్కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ హయాంలో రైతులకు తీవ్ర నష్టం కలిగిందని ఆరోపించారు. 18 శాతం తేమ ఉన్నా పత్తి కొనుగోలు చేయాలని తాము కేంద్రానికి లేఖ కూడా రాశామని గుర్తు చేశారు. 10 జిల్లాల్లో 5 లక్షల 39 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారని చెప్పారు.