ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన

ఆయిల్ ఫామ్ సాగుపై  రైతులకు అవగాహన

Jgl: మల్యాల మండలం పోతారం గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రంలో ఏఓ చంద్రదీపక్ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100%, సన్న, చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీ కల్పిస్తుందని తెలిపారు. అంతర్ పంటల సాగుకు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ. 4200 చొప్పున 4 సంవత్సరాలు రైతు ఖాతాల్లో నేరుగా జమ చేయబడుతుందన్నారు.