విజయవాడకు వెళ్లిన కలెక్టర్ ఆనంద్
అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.