జిల్లాకు పద్మా పురస్కారాలు దక్కడం గర్వంగా ఉంది: కలెక్టర్

భువనగిరి జిల్లాకు రెండు పద్మశ్రీ అవార్డులు దక్కడం గర్వంగా ఉందని కలెక్టర్ హన్మంత్ కె జెండగే అన్నారు. మండలంలోని ఆకుతోటబావితండాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కేతావత్ సోమ్లాల్నాయక్కు స్థానిక యువత ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కడు పేదరికాన్ని అనుభవిస్తూ ఆయన ఆలోచనను సాహిత్యం వైపు మళ్లించడమే ఆయన విజయానికి నిదర్శనమన్నారు.