గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర అస్వస్థత
PLD: చిలకలూరిపేట ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి కాలువలో పడి ఉన్నాడు. గమనించిన 108 సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడు ఫిట్స్తో బాధపడుతూ స్పృహలో లేడని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.