గొల్లప్రోలులో అక్రమ PDS బియ్యం పట్టివేత
KKD: గొల్లప్రోలు మండలం అక్రమంగా తరలిస్తున్న 1,200 కేజీల రేషన్(PDS) బియ్యాన్ని మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కె.నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2,55,800 ఉంటుందని అధికారులు వెల్లడించారు.