సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

NTR: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డా.జీ.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్ష కేంద్రంలో ఈనెల 22, 23, 24 తేదీలు, 30, 31 ఐదురోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు 106 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.