అయ్యర్, జైస్వాల్‌కు నిరాశ

అయ్యర్, జైస్వాల్‌కు నిరాశ

ఆసియా కప్‌కు ప్రకటించిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటుదక్కలేదు. జట్టులో శ్రేయస్‌కు చోటు దక్కడం ఖాయమని అంతా భావించినప్పటికీ సెలక్టర్లు అతడికి మరోసారి మొండిచేయి చూపించారు. అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్, యువ ఓపెనర్ జైస్వాల్‌కు కూడా నిరాశ ఎదురైంది. కాగా, రిషభ్ పంత్‌ను గాయం కారణంగా పరిగణనలోకి తీసుకోలేదు.