ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
E.G: నల్లజర్ల మండలం అయ్యవరంలో వాటర్ ప్లాంట్ను MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం ప్రారంభించారు. ద్వారక తిరుమల వెళ్లే భక్తుల దాహం తీర్చేందుకు నల్లజర్ల సొసైటీ డైరెక్టర్ గుడిసె శివకృష్ణ సొంత నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. 365 రోజులు సేవలందించే ఈ ప్లాంట్, ఈ వేసవిలో నడిచి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కొనియాడారు.