సర్పంచ్ బరిలో 106 మంది..హోరాహోరీ పోటీ
KMM: రఘునాథపాలెం మండలంలోని 37 పంచాయతీల్లో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 32 పంచాయతీల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. కొన్ని పంచాయతీల్లో 8 మందిపైగా అభ్యర్థులు తలపడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు స్వంత పార్టీ అభ్యర్థులు పోటీకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. మొత్తం పంచాయతీల్లో 106 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.