'అధికారుల అలసత్వంతోనే యూరియా కొరత'

KDP: అధికారుల అలసత్వంతోనే యూరియా కొరత ఏర్పడిందని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేది కాదన్నారు. అనంతరం సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందించినప్పుడే పంటల సాగు సక్రమంగా సాగుతుందన్నారు.