ధాన్యం కొనుగోలుపై ఆరా తీసిన జేసీ
ELR: జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ, రెవెన్యూ డివిజినల్ అధికారి డాక్టర్ అచ్యుత అంబరీష్లు దెందులూరు మండలం పోతునూరులో ధాన్యం కొనుగోలుపై పరిశీలన చేశారు. గ్రామంలోని రైతులతో వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రం, రైస్ మిల్లులలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.