టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్లు విరాళం

TPT: మహారాష్ట్రకు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం రూ.1.40 లక్షలు విలువైన బిగాస్సి 12 మాక్స్ 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ను టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో లోకనాథంకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గుప్తా స్కూటర్ తాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల డీఐ సుబ్రమణ్యం పాల్గొన్నారు.