'మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం'
MLG: BRS నాయకురాలు కొమరం ధనలక్ష్మి మతి తప్పి మాట్లాడుతున్నారని MLG జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి అన్నారు. గుడి ఆవరణ నిర్మాణానికి వంద కోట్లు ఖర్చు అయితే రూ. 200 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదని, అసత్య ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. మరోసారి సీతక్కపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.