వెలిగల్లు ప్రాజెక్టు నీటికి డిమాండ్

వెలిగల్లు ప్రాజెక్టు నీటికి డిమాండ్

అన్నమయ్య: గాలివీడు మండలంలో రైతులకు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు అందించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐదు గ్రామాల చెరువులు, గుంటలకు నీరు ఇవ్వాలని కోరారు. సాగునీరు వచ్చే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని రైతులకు పిలుపునిచ్చారు.