VIDEO: 'గాంధీనగర్ పార్క్ సమస్యలు పరిష్కరిస్తాం'
కాకినాడ గాంధీ నగర్ పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్ పార్కు పరిశీలనకు వచ్చిన కమిషనర్ కు పార్కులోని వాకర్స్, ప్రజలు పార్కులో నెలకొన్న సమస్యలను వివరించారు. సమస్యలను విన్న కమిషనర్ పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.