సబ్ స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా

సబ్ స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా

SDPT: కరెంట్ సమస్యపై గునుకుల కొండాపూర్ సబ్‌స్టేషన్ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కొండాపూర్, చీమలకుంటపల్లీ సర్పంచ్‌లు సొల్లు అజయ్ వర్మ, జంగిడి ప్రకాష్ పాల్గొన్నారు. రెండు రోజులుగా కరెంట్ లేక తాగునీరు, వ్యవసాయ పనులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అజయ్ వర్మ తెలిపారు. గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ వరకు ఎక్స్‌ప్రెస్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.