డ్వాక్రా మహిళలకు రుణాల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
ELR: బుట్టాయగూడెం జూనియర్ కాలేజ్ మైదానంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో స్థిరపడి విజయం సాధించాలని కోరారు. 59,341 మంది డ్వాక్రా మహిళలకు రూ.378 కోట్ల 36 లక్షల విలువైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే మహిళలకు అందజేశారు.