గ్రామాల విలీనంపై జనసేన నేత సంచలన ట్వీట్
VSP: విశాఖ జీవీఎంసీ గ్రామాల విలీనంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ప్రజల అభిప్రాయం లేకుండా గ్రామాలను కార్పొరేషన్లో కలపడం గ్రామ స్వరాజ్యాన్ని హరించడమేనని ఎక్స్లో గురువరం వ్యాఖ్యానించారు. అక్రమ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం గ్రామాల భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నాలను ఆయన ఖండించారు.