ముత్యాలమ్మ ఆలయంలో ఘనంగా చండీ హోమం

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం నర్సాపురం పట్టణానికి చెందిన మాదిరెడ్డి ఆనంద్ గాయత్రి రాణి దంపతులు ఘనంగా చండీ హోమం నిర్వహించారు. చండీ హోమం నిర్వాహకులు ఆగమ పండితులు అచ్యుత రామారావు శర్మ వేదమంత్రాలతో హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది తగిన ఏర్పాటు చేశారు.