నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

KMR: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్లకి 1,673 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1404.93/1405.00 అడుగులకు చేరుకోగా, ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 17.701/17.802 టీఎంసీలకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారి సాకేత్ తెలిపారు.