విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.32 లక్షలు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,32,239 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 86 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 5 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. 1795 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.