ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
NRPT: జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అతివేగంతో వాహనాలు నడపకూడదని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.